'ఆనందో బ్రహ్మ' పై రాజమౌళి ప్రశంశలు

Monday,August 28,2017 - 04:03 by Z_CLU

తాప్సి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆనందో బ్రహ్మ’. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రలో మహి వి రాఘవ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తుంది.

లేటెస్ట్ గా ఈ సినిమా చూసిన దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా పై ప్రశంశల జల్లు కురిపించాడు. ‘ఆనందో బ్రహ్మ’ గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించిన జక్కన్న “సినిమాకు రైటింగ్ అదిరిపోయిందని, అందరికి నచ్చేలా ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించారని, ముఖ్యంగా రాజీవ్ కనకాల చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడని, సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయ్యానని, ఈ సందర్భంగా టీం అందరికీ నా శుభాకాంక్షలు” అంటూ తెలిపాడు. సో జక్కన్న ప్రశంసలు అందుకున్న అతి తక్కువ సినిమాల్లో ఆనందో బ్రహ్మ కూడా ఓ చోటు సంపాదించుకుందన్నమాట..