"రాజా నరసింహ" ట్రైలర్ లాంఛ్

Monday,November 18,2019 - 11:25 by Z_CLU

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముటీ కథానాయకుడిగా రూపొందిన ‘మధుర రాజా’ చిత్రం తెలుగులో ‘రాజా నరసింహా’గా ఈ నెల 22న విడుదల కానుంది. ‘మన్యం పులి’ సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జై, మహిమా నంబియార్‌ కీలక పాత్రధారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపిస్తారు. జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధు శేఖర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల అగ్ర దర్శకుడు బోయపాటిశ్రీను ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

బోయపాటి మాట్లాడుతూ ”మధుర రాజా’ చిత్రం మలయాళంలో పెద్ద హిట్‌ అయింది. మమ్ముటీ గారి నటన అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. ట్రైలర్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. తెలుగులో తప్పకుండా విజయం సాధిస్తుంది. విడుదల రోజే సినిమా చూస్తా” అని అన్నారు

నిర్మాత సాధు శేఖర్‌ మాట్లాడుతూ ”చక్కని సందేశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముటీ పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో పాటు ప్రతినాయకుడిగా జగపతిబాబు క్యారెక్టర్‌, గోపీ సుందర్‌ సంగీతం, సన్నీలియోన్‌ ప్రత్యేక గీతం, పీటర్‌ హెయిన్స్‌ పోరాటాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసి ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.” అని అన్నారు.

ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్‌, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ.