`ఇద్దరి లోకం ఒకటే` రిలీజ్ కు రెడీ
Friday,November 29,2019 - 05:01 by Z_CLU
యంగ్ హీరో రాజ్తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్ ఎంటర్టైనర్ `ఇద్దరి లోకం ఒకటే`. దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మాతగా ఈ సినిమా రెడీ అవుతోంది. జీఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ – “మా బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా నటిస్తోన్న రెండో చిత్రమిది. క్యూట్ లవ్ స్టోరీ. యూత్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాను డైరెక్టర్ కృష్ణ తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే మిగిలిన పాటలు, ట్రైలర్ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.“ అన్నారు.
సాంకేతిక వర్గం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీఆర్.కృష్ణ
సమర్పణ: దిల్రాజు
నిర్మాత: శిరీష్
కెమెరా: సమీర్ రెడ్డి
మ్యూజిక్: మిక్కీ జె.మేయర్
ఎడిటింగ్: తమ్మి రాజు
డైలాగ్స్: అబ్బూరి రవి