AhanaPellanta రేపటి నుండి హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్

Wednesday,November 16,2022 - 01:01 by Z_CLU

రాజ్ తరుణ్ , శివాని రాజశేఖర్ జంటగా సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అహనా పెళ్ళంట’ వెబ్ సిరీస్ రేపే జీ5 రిలీజ్ అవుతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సిరీస్ లేటెస్ట్ రిలీజయిన సాంగ్స్ తో మరింత బజ్ క్రియేట్ చేస్తుంది. రాజ్ తరుణ్ తనకి పర్ఫెక్ట్ అనిపించే స్టోరీతో చేసిన ఈ వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయనుంది.

ఫ్యామిలీ అంతా కలిసి చూసే కంటెంట్ తో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిన ఈ సిరీస్ కి దావూద్ కథ -స్క్రీన్ ప్లే అందించగా కళ్యాణ్ రాఘవ్ డైలాగ్స్ ఇచ్చాడు. రాహుల్ తమడ, సాయి దీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

 ఆమని , హర్ష వర్ధన్ , పోసాని, గెటప్ శ్రీను , మధు నందన్ , రాజ్ కుమార్ , రవి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

 

నవంబర్ 17న ‘అహనా పెళ్ళంట‘ ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. Dont Miss it !

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics