ఒరేయ్ బుజ్జిగా కాంబో మళ్లీ కలిసింది
Thursday,September 24,2020 - 06:44 by Z_CLU
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై మహిదర్, దేవేష్ నిర్మాతలుగా ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ హైదరాబాద్ కోకాపేటలో పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు క్లాప్ కొట్టగా ప్రముఖ నిర్మాత గోపినాథ్ ఆచంట కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశాన్ని దేవుడి చిత్రపటాలపై చిత్రీకరించారు. స్క్రిప్ట్ను కె.ఎస్. రామారావు చేతుల మీదుగా దర్శకుడు విజయ్ కుమార్ అందుకున్నారు.
దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ – “గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. రాజ్ తరుణ్తో ఫుల్ లెంగ్త్ లవ్ ఎంటర్టైనర్గా `ఒరేయ్ బుజ్జిగా..` మూవీ చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఒక డిఫరెంట్ థ్రిల్లర్గా ఈ మూవీ ఉంటుంది. “ అన్నారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – “విజయ్ కుమార్ గారు చాలా టాలెండెడ్ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా మూవీని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. డెఫినెట్గా అది ఒక మంచి సినిమా అవుతుంది. వెంటనే ఆయనతో మరోసారి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది.“ అన్నారు.
నటీనటులు – రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే, పూర్ణ, మధు నందన్, అజయ్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర, ధన్రాజ్, కేదరి శంకర్, టిల్లు వేణు, భూపాల్, అప్పాజీ, రవివర్మ
టెక్నీషియన్స్
కథ-మాటలు: నంధ్యాల రవి,
సినిమాటోగ్రఫి: ఐ. ఆండ్రూ,
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
నిర్మాతలు: మహిదర్, దేవేష్,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా.