రాజ్ తరుణ్ కొత్త సినిమా రెడీ

Sunday,January 19,2020 - 01:02 by Z_CLU

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న థియేటర్లలోకి వస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ”మా ఒరేయ్ బుజ్జిగా షూటింగ్  పూర్తయింది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దర్శకులు కొండా విజయ్‌కుమార్‌గారు డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న చిత్రాన్ని విడుదల చేయనున్నాం.  తప్పకుండా మా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
మాటలు: నంద్యాల రవి
ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి
డాన్స్‌: శేఖర్‌
ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌
ఫైట్స్‌: రియల్‌ సతీష్‌
నిర్మాత: కె.కె.రాధామోహన్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్