మరో సినిమా స్టార్ట్ చేసిన రాజ్ తరుణ్

Wednesday,June 19,2019 - 05:56 by Z_CLU

ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేస్తున్న యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ మరో సినిమా స్టార్ట్ చేశాడు. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఈ కథను మూడేళ్ల పాటు కష్టపడి తయారుచేసుకున్నాడట దర్శకుడు కొండా విజయ్ కుమార్. గతంలో ఈ దర్శకుడు గుండెజారి గల్లంతయిందే లాంటి హిట్ సినిమా తీశాడు. ఆగస్ట్‌ నుండి ఈ సినిమా నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటుంది. హీరోయిన్ ను ఇంకా సెలక్ట్ చేయలేదు.

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
ఫొటోగ్రఫీ: ఆండ్రూస్‌
మాటలు: నంద్యాల రవి
ఆర్ట్‌: రాజ్‌కుమార్‌
కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి
మేకప్‌: శివ
నిర్మాత: కె.కె. రాధామోహన్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌