'ఒరేయ్ బుజ్జిగా' కంప్లీట్ ఎంటర్టైనర్ - రాజ్ తరుణ్

Thursday,March 12,2020 - 02:51 by Z_CLU

రాజ్ తరుణ్ , మాళవిక నాయర్ జంటగా విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రాదా మోహన్ నిర్మించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా మార్చ్ 25న రిలీజవుతుంది. ఈ సందర్భంగా సినిమాపై తన కాన్ఫిడెన్స్ ను బయటపెట్టాడు హీరో రాజ్ తరుణ్.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ ” ఒరేయ్ బుజ్జిగా‘ కంప్లీట్ ఎంటర్టైనర్. ఈ సినిమాను ప్యాషన్ తో అందరూ ముందుకు తీసుకొచ్చారు. అందరూ ప్రేమించి చేసిన సినిమా ఇది. థియేటర్స్ లో రెండున్నర గంటల పాటు నవ్వుతూనే ఉంటారు. బాగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ అంతా థియేటర్స్ కొచ్చి సరదాగా నవ్వుకుంటారని ఆశిస్తున్నా. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి ” అన్నారు.