డైరక్టర్ గా మారబోతున్న హీరోయిన్

Saturday,June 13,2020 - 01:06 by Z_CLU

నటి నిత్యామీనన్ తను కథలు రాస్తున్నట్టు, కుదిరితే దర్శకత్వం వైపు అడుగులు వేస్తానని తాజాగా ప్రకటించింది. ఇప్పుడు ఇదే దారిలో నడుస్తోంది మరో ముద్దుగుమ్మ. ఆమె పేరు రాధికా ఆప్టే.

తెలుగులో బాలయ్య సరసన లెజెండ్ లాంటి సినిమాలో నటించిన రాధికా ఆప్టే, ఈ లాక్ డౌన్ టైమ్ లో లండన్ లో ఉంది. లాక్ డౌన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే తన భర్తతో కలిసి లండన్ చేరుకున్న రాధిక ఆప్టే.. అక్కడే కథలు రాయడం మొదలుపెట్టింది.

తను కథలు రాస్తున్న మాట వాస్తవమేనంటోంది రాధిక. అయితే తను రాస్తున్న కథలు ఎటు వైపు వెళ్తాయో తనకే తెలియడం లేదంటోంది. సినిమాలుగా మలిచేంత స్టఫ్ తన కథలకు ఉందో లేదో తనకు తెలియదని.. నిజంగా సినిమాగా తీసేంత మేటర్ తన స్టోరీల్లో ఉంటే కచ్చితంగా తనే దర్శకురాలిగా మారతానని చెబుతోంది.

మరోవైపు లాక్ డౌన్ ప్రభావం తనపై పెద్దగా లేదంటోంది ఈ బ్యూటీ. లండన్ లో పెద్దగా ఆంక్షలు లేవని, దీంతో ఇంట్లోనే ఉండకుండా, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేశానని చెబుతోంది.