Radheshyam థీమ్ తో ఆకట్టుకున్న రిలీజ్ ట్రైలర్

Thursday,March 03,2022 - 11:14 by Z_CLU

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ భారీ అంచనాలతో మార్చ్ 11న థియేటర్స్ లోకి రాబోతుంది. ఎప్పటికప్పుడు కంటెంట్ తో ఎట్రాక్ట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా రిలీజ్ ట్రైలర్ వదిలారు మేకర్స్. ముంబైలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేశారు. నిమిషం నిడివితో విడుదల చేసిన ఈ ట్రైలర్ ద్వారా సినిమా థీమ్ గురించి క్లారిటీ గా చెప్పేశారు మేకర్స్. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ గురించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు.

చెయి చూసి ఫ్యూచర్ ని వాయిస్ విని పాస్ట్ ని చెప్పేస్తావా ?” అంటూ ఓ వాయిస్ తో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ట్రైలర్ లో చెప్పారు. సినిమాలో హస్త రేఖలు చూసి జాతకం చెప్పేసే పామిస్ట్ విక్రమ్ ఆదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. రిలీజ్ ట్రైలర్ ద్వారా సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండనుంది ? ఆ పాత్ర కథని ఎలా ముందుకు తీసుకెళ్లనుందనే విషయంపై హింట్ ఇస్తూ కట్ చేసిన సీన్స్ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

 ట్రైలర్ లో జగపతి బాబు “ఇంకోక సారి చెయి చూడు” అనగానే ప్రభాస్ ” నాకు రెండో సారి చూసే అలవాటు లేదు” అంటూ చెప్పే సీన్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. “ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు” అంటూ పూజ చెప్పే డైలాగ్ తో సినిమాపై ఆసక్తి రేకెత్తించారు.

మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం..మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి“, అంటూ ప్రభాస్ వాయిస్ తో  స్టార్టయిన ట్రైలర్ ” ప్రేమకి విధి కి మధ్య జరిగే యుద్దమే” అంటూ రాజమౌళి వాయిస్ ఎండయిన ట్రైలర్ లో విజువల్స్ , ఆర్ట్ వర్క్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ హైలైట్స్ గా నిలిచి సినిమా క్వాలిటీ ని మరోసారి రుచి చూపించాయి. ఓవరాల్ గా రిలీజ్ ట్రైలర్ ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా మీద భారీ అంచనాలు పెంచేసి చేసి బజ్ క్రియేట్ చేస్తోంది.  ముంబై ఈవెంట్ నుండి ప్రభాస్ మొదలు పెట్టిన ప్రమోషన్స్ రిలీజ్ వరకూ నాన్ స్టాప్ గా జరగనున్నాయి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics