'రాగల 24 గంటల్లో' రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,September 23,2019 - 10:02 by Z_CLU

‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘యమగోల మళ్ళీ మొదలైంది’, ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’ ‘ఢమరుకం’ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాగల 24 గంటల్లో’‌‌. ఈ సినిమా టీజర్ ను ఈ నెల 25న, చిత్రాన్ని అక్టోబర్ 18న ‌ విడుదల చేయనున్నారు.

సత్యదేవ్, ఇషా రెబ్బా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీరామ్‌, ముస్కాన్‌ సేథ్, గణేశ్‌ వెంకట్రామన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్‌ కానూరు నిర్మించారు.

ఈమధ్యే సినిమాకు సంబంధించి 2 ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. అలాగే దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రముఖ హాస్యనటుడు కృష్ణభగవాన్ ఈ చిత్రంతో మాటల రచయితగా పరిచయం అవుతున్నారు. ఆయన రాసిన మాటలు, రఘు కుంచె బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో పాటు, ‘గరుడ వేగ’ ఫేమ్‌ అంజి కెమెరావర్క్‌ సినిమాకి హైలెట్స్.