`రాగల 24 గంటల్లో` రిలీజ్ డేట్ ఫిక్స్
Saturday,November 02,2019 - 02:16 by Z_CLU
సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం `రాగల 24 గంటల్లో`. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్పై `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది. దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 15న విడుదల చేస్తున్నారు.
దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – “సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. నవంబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కెమెరా, మ్యూజిక్ ఈ సినిమాకి రెండు కళ్ళు. అంజి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. రఘు అద్భుతమైన పాటలు, రీ-రికార్డింగ్ చేశాడు. కృష్ణభగవాన్ స్క్రిప్ట్ నచ్చి మనసు పెట్టి మంచి డైలాగ్స్ రాశారు. సినిమా అన్ని వర్గాలను మెప్పించేలా ఉంటుంది“ అన్నారు.
నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ – “ నవంబర్ 15న `రాగల 24 గంటల్లో` వంటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ను తొలి చిత్రంగా ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ మంచి సహకారాన్ని అందించారు. చిన్నపిల్లలు నుండి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది“అన్నారు.
నటీనటులు:
సత్యదేవ్, ఈషా రెబ్భ, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ, కృష్ణభగవాన్, టెంపర్ వంశీ, అజయ్, అనురాగ్, రవి వర్మ, రవిప్రకాష్, మానిక్ రెడ్డి, అదిరే అభి తదితరులు.
సాంకేతిక వర్గం:
స్క్రీన్ ప్లే-డైరెక్షన్: శ్రీనివాస్ రెడ్డి
ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కానూరు
లైన్ ప్రొడ్యూసర్: యం. ఎస్. కుమార్
ఎడిటర్: తమ్మిరాజు
కెమెరా: గరుడవేగ అంజి
ఆర్ట్: చిన్నా
సంగీతం: రఘు కుంచె
కథ: వై.శ్రీనివాస్ వర్మ
మాటలు: కృష్ణభగవాన్
పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి
ఫైట్స్: విక్కీ
డాన్స్: స్వర్ణ, భాను