'మెహబూబా' టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్
Saturday,February 10,2018 - 05:00 by Z_CLU
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిన్న (ఫిబ్రవరి 9న) విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
తెలంగాణ, ఆంధ్రపద్రేశ్, యు.ఎస్.లలో 500 థియేటర్లలో ఈ టీజర్ విడుదలైంది. చాలా డిఫరెంట్గా ఉన్న ఈ టీజర్కి కొన్ని గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. పూరి జగన్నాథ్ కెరీర్లోనే డిఫరెంట్ మూవీగా ‘మెహబూబా’ తెరకెక్కుతోంది. సమ్మర్లో చాలా గ్రాండ్గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆకాష్ పూరి సరసన నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ, యాక్షన్: రియల్ సతీష్, ఆర్ట్: జానీ షేక్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్.