ఆఫీస్ క్లోజ్ చేసిన పూరి జగన్నాధ్

Tuesday,March 17,2020 - 01:15 by Z_CLU

కరోనా ఎఫెక్ట్ తో పూరి కనెక్ట్స్ ఆఫీస్ క్లోజ్ అయింది. ఈ మేరకు దర్శక-నిర్మాత పూరి జగన్నాధ్ నుంచి అఫీషియల్ నోట్ ఒకటి వచ్చింది. తమ సంస్థ నుంచి అడ్మినిస్ట్రేటివ్ వర్క్, ప్రొడక్షన్ వర్క్ ను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు ప్రకటించాడు పూరి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేస్తున్నాడు పూరి. ముంబయిలో ఈ సినిమాకు సంబంధించి 40 రోజుల భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. హైదరాబాద్ లో త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడా షెడ్యూల్ డైలమాలో పడింది.

దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. సినిమాలో బాక్సర్ గా కనిపించబోతున్నాడు విజయ్ దేవరకొండ. త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్ డీటెయిల్స్ ఎనౌన్స్ చేస్తారు.