అనుపమ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Saturday,January 28,2017 - 03:06 by Z_CLU

రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో చెర్రీ సరసన అనుపమ ఛాన్స్ కొట్టేసిందనే వార్త మొన్నటి వరకూ వినిపించగా ఉన్నట్టుండి అనుపమ ఈ సినిమా నుంచి అవుట్ అనే వార్త బయటికొచ్చింది. ఈ వార్త ఇలా బయటికొచ్చిందో లేదో అనుపమ ను రెమ్యూనరేషన్ డిమాండ్ చెయ్యటం వల్లే సినిమా నుంచి తొలగించారని టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

rc-11

గతం లో మహేష్ తో శ్రీమంతుడు సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా అనుపమ విషయం పై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు “అనుపమ రామ్ చరణ్-సుకుమార్ ప్రాజెక్ట్ లో లేని విషయం నిజమే కానీ ఆమె ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అనుపమ ఎప్పుడు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదని తను టాలెంటెడ్ అమ్మాయి అని, ఈ సినిమా కాకపోయినా మా బ్యానర్ లో నిర్మించే మరో సినిమాలో పనిచేస్తుందని” చెప్తూ రూమర్లకు చెక్ పెట్టేసారు మైత్రి సంస్థ నిర్మాతలు.