కీర్తి సురేష్ స్థానంలో ప్రియమణి...?

Wednesday,January 22,2020 - 11:02 by Z_CLU

నిన్నా మొన్నటి వరకు ఆ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్. ఒకరోజు షూటింగ్ కూడా జరిగింది. కానీ ఆ తరవాతే మేకర్స్ కీర్తి సురేష్ ని కాదని ఆ స్థానంలో ప్రియమణిని ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కో సినిమాకి సంతకం చేస్తూ బిజీ హీరోయిన్ అనిపించుకుంటున్న ప్రియమణి ఈ అవకాశం దక్కించుకోవడంతో, కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ… ఇప్పట్లో కాదని తేలిపోయింది. అసలు విషయమేంటంటే…

అజయ్ దేవగన్ సరసన ‘మైదాన్’ సినిమాలో ఫిక్సయింది కీర్తి సురేష్. 1950 బ్యాక్ డ్రాప్ లో ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జస్ట్ గ్లామరస్ హీరోయిన్ గానే కాదు, తల్లిగా కూడా నటించాల్సి ఉంది. మేకర్స్ కీర్తిని ఈ సినిమా హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నప్పటికీ అంతా బానే ఉంది. కానీ ఈ మధ్య కీర్తి ఒక్కసారిగా బరువు తగ్గడం ఈ క్యారెక్టర్ కి కీర్తిని దూరం చేసింది.

బరువు తగ్గి మరింత యంగ్ లుక్ లో కనిపిస్తున్న కీర్తి సురేష్ ఈ క్యారెక్టర్ కి సూట్ అవ్వట్లేదు అనే కారణంతో సీనియర్ నటి ప్రియమణిని ఈ క్యారెక్టర్ కి కన్సిడర్ చేశారు. దీంతో ప్రియమణి కీర్తి స్థానంలోకి వచ్చేసింది. ఓ వైపు వెబ్ సిరీస్, వెంకీ సరసన ‘అసుర’ లతో బిజీగా ఉన్న ప్రియమణి, ఈ సినిమా ఆఫర్ కూడా దక్కడంతో చిన్నగా ఫామ్ లోకి వచ్చేసింది.