కన్నడ డైరెక్టర్ టాలీవుడ్ హీరోలతో బిజీ !

Friday,May 21,2021 - 06:41 by Z_CLU

KGF తో ఉన్నపళంగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ‘KGF 2’ సినిమా చేస్తున్న ఈ దర్శకుడు తెలుగు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. అవును ఇప్పటికే ప్రభాస్ తో ‘సలార్’ అనే సినిమా మొదలు పెట్టి షూటింగ్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. నిన్న ఈ కాంబో సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఎప్పటి నుండో ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో ఎనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్ నిన్న వచ్చిన ఈ ప్రకటనతో సంతోషంలో తేలారు.

ntr prashanth neel movie announcement zeecinemalu 1

అయితే ప్రశాంత్ నీల్ కేవలం ప్రభాస్ , ఎన్టీఆర్ లతో మాత్రమే కాదు తెలుగులో మరికొందరు స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్నాడట. ఇటివలే అల్లు అర్జున్ కి కూడా ప్రశాంత్ ఓ లైన్ చెప్పాడట. అన్ని కుదిరితే త్వరలోనే అల్లు అర్జున్ -ప్రశాంత్ నీల్ కాంబో నుండి కూడా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇలా వరుసగా ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో సెటిలవ్వాలని చూస్తున్నాడు ప్రశాంత్.

ప్రశాంత్ నీల్ కి KGF తో వచ్చిన క్రేజ్ దాని సీక్వెల్ ‘KGF 2’ తో రెట్టింపయితే తెలుగులో అతను మరింత బిజీ అవుతాడు. టాలీవుడ్ లో మిగతా స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ తో మాస్ యాక్షన్ సినిమా చేసేందుకు ముందుకు వస్తారు. ఏదేమైనా ఓకె ఒక్క సినిమాతో మన హీరోలను ఎట్రాక్ట్ చేసి బిజీ షెడ్యుల్ ఉన్నప్పటికీ వారి డేట్స్ అందుకొని సినిమాలు తీస్తున్నాడు ప్రశాంత్. త్వరలోనే అల్లు అర్జున్ -ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి కూడా ఓ ఎనౌన్స్మెంట్ వచ్చేస్తే బన్నీ ఫ్యాన్స్ ఖుషి అవుతారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics