సైలెంట్ గా స్టార్ట్ అయిన సాహో షూటింగ్

Saturday,June 10,2017 - 11:58 by Z_CLU

 

బాహుబలి-2 లాంటి ఆల్ టైం హిట్ తర్వాత ప్రభాస్ చేయబోయే సాహో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు బాహుబలి-2తో పాటు విడుదల చేసిన టీజర్.. ఆలిండియా లెవెల్లో సూపర్ గా క్లిక్ అవ్వడంతో.. సాహోపై అందరి దృష్టిపడింది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అంతా ఎదురుచూశారు. అయితే ఎలాంటి హంగామా లేకుండా, సినిమా సైలెంట్ గా సెట్స్ పైకి వచ్చేసింది.

అవును.. సాహో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ నిన్నట్నుంచి ప్రారంభమైంది. అయితే ఈ షూట్ లో ప్రభాస్ మాత్రం లేడు. కేవలం కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులతో కొన్ని  సన్నివేశాలు తెరకెక్కించారు. త్వరలోనే రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో షూటింగ్ మొదలవుతుంది. ఆ సెట్స్ పైకి ప్రభాస్ వస్తాడు.

రామోజీ ఫిలింసిటీలో షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే దుబాయ్ లో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. సినిమాకు సంబంధించిన మేజర్ యాక్షన్ పార్ట్ అంతా దుబాయ్ లోనే పిక్చరైజ్ చేయబోతున్నారు. దాదాపు 150కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి.