Radheshyam - 3 రోజుల్లో 151 రూ. కోట్లు

Monday,March 14,2022 - 03:34 by Z_CLU

ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘రాధేశ్యామ్‘ సినిమా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. ఈ 3 రోజుల్లో సినిమాకు వరల్డ్ వైడ్ 151 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచింది ‘రాధే శ్యామ్’.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా స్టడీగా నడుస్తోంది. నిన్నటికి ‘రాధేశ్యామ్’ కు ఏపీ, నైజాం నుంచి 75 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. విడుదలైన ప్రతి సెంటర్ లో దాదాపు 60శాతానికి పైగా బ్రేక్ ఈవెన్ సాధించింది.

అటు ఓవర్సీస్ లో కూడా ‘రాధేశ్యామ్’ హంగామా కొనసాగుతోంది. ఫస్ట్ వీకెండ్ లో 1.7 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. రేపటికి ఈ సినిమా యూఎస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుకుంటుంది. ఏపీ, నైజాంలో రాధేశ్యామ్ కు 3 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 22.31 కోట్లు
సీడెడ్ – రూ. 6.65 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.26 కోట్లు
ఈస్ట్ – రూ. 3.87 కోట్లు
వెస్ట్ – రూ. 2.98 కోట్లు
గుంటూరు – రూ. 4.08 కోట్లు
నెల్లూరు – రూ. 1.90 కోట్లు
కృష్ణా – రూ. 2.34 కోట్లు

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics