మరో షెడ్యుల్ ఫినిష్ చేశాడు

Monday,April 01,2019 - 07:20 by Z_CLU

సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సాహో’ ను ఓ కొలిక్కి తీసుకొచ్చిన ప్రభాస్ మరో వైపు రాధా కృష్ణతో చేస్తున్న సినిమా షూటింగ్ ని కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు .. రాధా కృష్ణ – ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి రెండో షెడ్యుల్ పూర్తయిందట. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసాడు దర్శకుడు. 1970 లో యూరప్ బ్యాక్ డ్రాప్ లో ఇద్దరు టైం లెస్ లవర్స్ స్టోరీతో సినిమా తెరకెక్కుతుందని తెలిపాడు.

యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మూడో షెడ్యుల్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ గ్యాప్ లో సాహోకి సంబంధించి మిగిలిన షూట్ ఫినిష్ చేసేపనిలో ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ 20 నెక్స్ట్ షెడ్యుల్ కోసం హైదరాబాద్ లో ఏకంగా 18 సెట్స్  వేయబోతున్నారట. ప్రతిసారి యూరప్ వెళ్లడం కుదరదు. మరీ ముఖ్యంగా 1970ల నాటి పరిస్థితులు ఎక్కడా కనిపించవు. అందుకే ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయబోతున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి ‘జాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.