‘సాహో’ దుబాయ్ షెడ్యూల్ కి బ్రేక్ ఇవ్వనున్న ప్రభాస్

Thursday,April 26,2018 - 07:14 by Z_CLU

ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. దుబాయ్ లోని అబూదాబిలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే మే ఫస్ట్ వీక్ నుండి ఈ షెడ్యూల్ కి బ్రేక్ ఇవ్వనున్నాడు ప్రభాస్. ‘సాహో’ సినిమా సెట్స్ పై ఉండగానే  రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్  లో తెరకెక్కనున్న  తన నెక్స్ట్  సినిమాకి ప్రిపేర్ అవుతున్న రెబల్ స్టార్, ఈ గ్యాప్ లో ముంబైలో జరగనున్న వర్క్ షాప్ లో పాల్గొంటాడు.

రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ ప్రస్తుతానికయితే బయటికి రాలేదు కానీ, కంప్లీట్ గా డిఫెరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే మే ఫస్ట్ వీక్ లో ఈ మూవీ వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. అందుకే ప్రభాస్ దుబాయ్ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చి ముంబైకి రానున్నాడు. ఈ వర్క్ షాప్ కి పూజా హెగ్డే కూడా అటెండ్ కానుంది.

ఈ వర్క్ షాప్ తరవాత మళ్ళీ ‘సాహో’ టీమ్ ని జాయిన్ కానున్న ప్రభాస్, 2 సినిమాలను సైమల్టేనియస్ గా కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ జూన్ లో సెట్స్ పైకి రానుంది. కృష్ణంరాజు ఈ  సినిమాకి ప్రొడ్యూసర్.