సాహో ఆలస్యం... రీజన్ అదే

Sunday,May 14,2017 - 11:06 by Z_CLU

లేటెస్ట్ గా బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ ఇమేజ్ అందుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా ‘సాహో’ ను జులై నుంచి సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు.. రీసెంట్ గా రిలీజైన సాహో టీజర్ ఇప్పటికే ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసి ఎట్రాక్ట్ చేయడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుందట యూనిట్.. 150 కోట్ల బడ్జెట్ తో సుజిత్ డైరెక్షన్ లో యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా విషయంలో ఏ మాత్రం ఖంగారు పడకూడదని హై అండ్ టెక్నీకల్ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించి ఫాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ను కూడా మెస్మరైజ్ చేయాలనీ భావిస్తున్నాడట ప్రభాస్.. అందుకే లేట్ అయినా లేటెస్ట్ గా ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారట మేకర్స్… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.