హైదరాబాద్ లో ప్రభాస్ ‘సాహో’...

Wednesday,February 06,2019 - 06:57 by Z_CLU

మరో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్రిపరేషన్స్ లో ఉంది ‘సాహో’ టీమ్. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ని నిర్మిస్తున్నారు మేకర్స్. ముంబాయి లోని రద్దీ ఏరియా ‘వోర్లీ’ ని హైదరాబాద్ లోనే రీక్రియేట్ చేస్తుంది సుజిత్ &  టీమ్. దుబాయ్ లోని అబూదాబి సీక్వెన్స్ తరవాత, మళ్ళీ అదే స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఫైట్స్, ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తారట మేకర్స్.

జస్ట్ అబూదాబి షెడ్యూల్ కే 50 కోట్లకు పైగా స్పెండ్ చేసిన మేకర్స్, ఈ సెట్ కోసం కూడా భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. సినిమాలో అబూదాబి యాక్షన్ ఎలిమెంట్స్ తరవాత మళ్ళీ అదే స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఫైట్ సీక్వెన్సెస్ ని ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నారు మేకర్స్.

ఈ సినిమా ఆగష్టు 15 న రిలీజ్ కానుంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ‘సాహో’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజవుతుంది. UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి శంకర్-ఎహసాన్-లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.