ప్రభాస్ కొత్త సినిమా మళ్లీ మొదలైంది

Friday,January 17,2020 - 05:08 by Z_CLU

బాహుబలి, సాహో సక్సెస్ ఫుల్ చిత్రాల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఇవాళ్టి నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వచ్చింది. గోపికృష్ణ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థతో అనుబంధంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.

బిగ్ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో వస్తోంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేక సెట్ ను వేశారు. నిజానికి సాహో టైమ్ లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. కొన్ని రోజులు షూట్ కూడా చేశారు. ఆ తర్వాత పూర్తిగా సినిమాను పక్కనపెట్టాడు ప్రభాస్. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా సెట్స్ పైకి వస్తోంది.

ఇకపై ఎలాంటి గ్యాప్స్ లేకుండా షూటింగ్ పూర్తిచేసి, ఈ ఏడాదిలోనే మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడ్ని ఇంకా ఫిక్స్ చేయలేదు.

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
ఎడిటర్ :శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్
సమర్పణ : గోపికృష్ణ మూవీస్ కృష్ణం రాజు
బ్యానర్ : యూవీ క్రియేషన్స్ నిర్మాతలు: ప్రమోద్, వంశీ
దర్శకుడు : కే కే రాధాకృష్ణ కుమార్