ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు...

Sunday,December 31,2017 - 11:06 by Z_CLU

ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీ గా ఉన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టేశాడు. సాహో సినిమా తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ తో సినిమా చేయబోతున్న ప్రభాస్ ఈ సినిమాను కొత్త ఏడాది ప్రారంభంలోనే స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజికి చేరుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి లేదా మార్చ్ లో సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు ప్రభాస్.

లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను గోపి కృష్ణ పిక్చర్స్ బ్యానర్ లో చేయబోతున్న ప్రభాస్ ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేసి మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా ఫైనల్ చేసుకోబోతున్నాడని సమాచారం. సో ఒకే టైంలో ఇటు సుజీత్ సినిమా అటు రాధా కృష్ణ సినిమాను కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నాడన్నమాట ప్రభాస్.