మరోసారి తెరపైకి పౌర్ణమి బ్యాచ్ ..?

Sunday,July 02,2017 - 11:02 by Z_CLU

ఇటీవలే ‘బాహుబలి’ తో బిగ్గెస్ట్ హిట్ సాధించి ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు అందుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత జిల్ ఫేమ్ రాధా కృష్ణ డైరెక్షన్ లో గోపీకృష్ణ బ్యానర్ లో ఓ సినిమా చేస్తాడు. ఈ రెండు సినిమా తర్వాత ప్రభాస్ నెక్స్ట్ డైరెక్టర్ లిస్ట్ లో ప్రభుదేవా చేరాడట.

అప్పట్లో ప్రభాస్ తో ‘పౌర్ణమి’ సినిమాను తెరకెక్కించిన ప్రభుదేవా మరోసారి ప్రభాస్ ను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడట. ఇటీవలే ప్రభాస్ ని కలిసి ఓ స్టోరీలైన్ కూడా వినిపించాడట. సుజీత్, రాధాకృష్ణ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని టాక్.

ప్రభుదేవాకు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ కు ఎలాగూ అక్కడ క్రేజ్ వచ్చేసింది. సో.. ప్రభాస్-ప్రభుదేవా సినిమాను కూడా ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్లాన్ చేస్తున్నారట.