ప్రభాస్ .. మహేష్.. ఎన్టీఆర్... వీరిలో ఎవరితో ?

Sunday,March 10,2019 - 12:01 by Z_CLU

ప్రభాస్ , మహేష్, ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ ముగ్గురి మధ్య ఓ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. ‘కే.జి.ఎఫ్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా అంటూ ఈ ముగ్గురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.

మొన్నటి వరకూ ప్రశాంత్, ప్రభాస్ కి ఓ స్క్రిప్ట్ చెప్పాడని, ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 2’ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.. అయితే ఇప్పుడు ప్రభాస్ తో కాకుండా మహేష్ తో ప్రశాంత్ సినిమా ఉండబోతుందనే వార్త వినిపిస్తుంది.

ప్రశాంత్ నెక్స్ట్  లిస్టు లో ఈ ఇద్దరితో పాటు లేటెస్ట్ గా ఎన్టీఆర్ పేరు కూడా తెరపైకొచ్చింది. నిజానికి ఈ ముగ్గురిలో  ప్రశాంత్ ఇంకా ఎవరికీ స్క్రిప్ట్ చెప్పలేదని, ఇవి ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్న వార్తలని తెలుస్తోంది.  ‘కే.జి.ఎఫ్’ తో తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేసిన ప్రశాంత్ తమ అభిమాన హీరోతో కూడా ఈ తరహా మాస్ సినిమా చేయాలనే ఫ్యాన్ ఆలోచనలో నుండి వస్తున్న వార్తలివి. మరి ఫ్యాన్స్ కోరిక మేరకూ ప్రశాంత్ త్వరలోనే తెలుగు సినిమా చేస్తాడా..లేదా..చూడాలి.