'మిర్చి' కాంబో రిపీట్ !

Sunday,February 09,2020 - 01:13 by Z_CLU

‘బాహుబలి’ ఫ్రాంచైజీ కంటే ముందు ప్రభాస్ కెరీర్ లో భారీ హిట్ ‘మిర్చి’ అనేది అందరికీ తెలిసిందే. ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు కొరటాల శివ. ఇక అక్కడి నుండి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ‘మిర్చి’ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ జరుగుతుంది.

అవును ‘మిర్చి’ సక్సెస్ తర్వాత కొరటాల శివ, ప్రభాస్ తో మరో సినిమా కమిట్ అయ్యాడు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ కమిట్ మెంట్ తో ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. ‘మిర్చి’లో ప్రభాస్ ను పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసిన శివ ఈసారి కూడా అలాంటి పవర్ ఫుల్ రోల్లోనే చూపించేలా ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. ఇటివలే ప్రభాస్ ను కలిసి ఆ స్క్రిప్ట్ వినిపించాడట. ప్రస్తుతం మెగా స్టార్ ను డైరెక్ట్ చేస్తున్న కొరటాల ఆ సినిమా పూర్తవ్వగానే ప్రభాస్ తో సినిమా చేస్తాడని సమాచారం.

ఈ కాంబినేషన్ లో సినిమాను యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ నిర్మించనున్నారు. త్వరలోనే ఈ కాంబో సినిమా డీటెయిల్స్ బయటికి రానున్నాయి.