మే 11 న రానున్న పూరి జగన్నాథ్ మెహబూబా

Saturday,March 24,2018 - 01:47 by Z_CLU

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘మెహబూబా’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. అల్టిమేట్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 11 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సినిమాలో పూరి ఆకాష్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ యూత్ లో పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఆకాష్ ని పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకోవడం తో టాలీవుడ్ లో ఈ సినిమా చుట్టూ, మరింత హైప్ క్రియేట్ అవుతుంది.

 

ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. మెహబూబా సినిమా పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిలిమ్ మేకర్స్.