Pooja Hegde - మహేష్ సరసన మరోసారి?
Monday,August 09,2021 - 05:46 by Z_CLU
Mahesh Babu Pooja Hegde.. ఇద్దరూ కలిసి ఇప్పటికే మేజిక్ క్రియేట్ చేశారు. మహేష్ నటించిన ప్రతిష్టాత్మక మహర్షి సినిమాలో పూజా హెగ్డేనే హీరోయిన్. ఇప్పుడు మరోసారి ఈ పెయిర్, సిల్వర్ స్క్రీన్ పై కనువిందు చేయబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మహేష్ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు.
తన సినిమాల్లో వరుసగా పూజా హెగ్డేను రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ హీరోగా తీసిన అరవింద సమేత సినిమాలో పూజాహెగ్డేనే తీసుకున్నాడు. ఆ తర్వాత బన్నీ హీరోగా తెరకెక్కించిన అల వైకుంఠపురములో సినిమాలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా మరోసారి పూజానే రిపీట్ చేస్తున్నాడు. ఇలా వరుసగా పూజా హెగ్డేతో వర్క్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు త్రివిక్రమ్.
పూజాతో వరుసగా వర్క్ చేయడానికి రీజన్ కూడా చెప్పాడు త్రివిక్రమ్. ఆమె యాక్టింగ్ టాలెంట్ తో పాటు డెడికేషన్, డబ్బింగ్ చెప్పుకునే విధానం త్రివిక్రమ్ కు బాగా నచ్చాయట. ఆమె హార్డ్ వర్కింగ్ చూసి ముచ్చటపడ్డాడట. అందుకే వరుసగా ఆమెకు అవకాశాలిస్తున్నాడు. అటు పూజా కూడా ఎంత బిజీగా
ఉన్నప్పటికీ.. త్రివిక్రమ్ అడిగితే కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయకుండా ఉండలేదు. ఇప్పుడు మహేష్ మూవీకి కూడా అదే చేసింది.
నిజానికి మహేష్-త్రివిక్రమ్ సినిమా ఎనౌన్స్ మెంట్ చేసిన వెంటనే అందులో హీరోయిన్ గా పూజా హెగ్డే మాత్రమే ఉంటుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే వరుస సినిమాలతో పూజా బిజీగా ఉండడంతో, ఈసారి మరో హీరోయిన్ ను తీసుకునే అవకాశం ఉందని భావించారు. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకొచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టులో పూజానే హీరోయిన్ అనే విషయాన్ని ఈరోజు అఫీషియల్ గా ప్రకటించారు.
త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. మథి కెమెరామెన్. నవీన్ నూలి ఎడిటర్ గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేయబోతున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాథాకృష్ణ నిర్మాతగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది ఈ సినిమా.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics