ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే

Monday,March 05,2018 - 11:11 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే చూడాలని ఎంతో కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ కాంబినేషన్ రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేశారు.

తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి. ఎస్. వినోద్ అందిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం ను నిర్మించనున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాదిలోనే సినిమా థియేటర్లలోకి వస్తుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ, వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ను నిర్మించిన విషయం తెలిసిందే.