మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో పాయల్

Monday,March 18,2019 - 11:46 by Z_CLU

ఆర్ఎక్స్100 సక్సెస్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న పాయల్ రాజ్ పుత్, మళ్లీ బిజీ అయిపోయింది. వరుసగా సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తోంది. ఇప్పటికే వెంకీ మామ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే స్టేజ్ లో ఉంది.

వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. స్టువర్టుపురంకు చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లైఫ్ కు సంబంధించిన సినిమా ఇది. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా పాయల్ ను తీసుకున్నారట.

సీత సినిమాను పూర్తిచేసిన బెల్లంకొండ, ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ప్రాజెక్టు కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా మాటలు అందించబోతున్నాడు. సీత రిలీజ్ అయిన వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వస్తాయి.