పవన్-త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికే

Friday,June 02,2017 - 05:05 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇంజినీర్ గా కనిపించబోతున్న ఈ సినిమాను మొన్నటివరకూ దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్.. తాజాగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

ఇప్పటికే పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పవన్ సరసన కీర్తి సురేష్-అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారనే వార్త చక్కర్లు కొడుతుండడంతో ఈ సంక్రాంతి బరిలో పవర్ స్టార్ తన పవర్ చూపిస్తాడని సంతోషపడిపోతున్నారు ఫ్యాన్స్.