పవన్-త్రివిక్రమ్ మూవీ డీటెయిల్స్

Tuesday,April 25,2017 - 01:00 by Z_CLU

గతంలో ‘జల్సా’,’అత్తారింటికి దారేది’వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు నుంచి రెండో షెడ్యూల్ జరుపుకోనుంది. హైదరాబాద్ లో జరగనున్న ఈ షెడ్యూల్ మే మొదటి వారం వరకూ జరగనుందని సమాచారం..

 

మొదటి షెడ్యూల్ లో పవన్-కీర్తి సురేష్ అను ఇమ్మానుయేల్ లతో పాటు ఖుష్బూ, రావు రమేష్, రగుబాబు, మురళి శర్మ వంటి నటీ నటులతో పాటు మరికొందరి పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించిన యూనిట్ రెండో షెడ్యూల్ లో మరి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించ నున్నారట.. పవన్ ను ఇప్పటి వరకూ చూడని సాఫ్ట్ వెర్ క్యారెక్టర్ లో చూపిస్తూ తన దైన పంచ్ డైలాగ్స్ తో సినిమాను పవర్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిస్తున్నాడట త్రివిక్రమ్. మరి వీరిద్దరి పవర్ ఫుల్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచానాలే నెలకొంటున్నాయి..