పవన్-క్రిష్ మూవీ లాంఛ్

Wednesday,January 29,2020 - 12:46 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి మరో సినిమా రెడీ అవుతోంది. పవన్-క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మాతగా రాబోతోంది ఈ సినిమా. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించబోతున్నాడు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్. హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.

ప్రస్తుతం పింక్ రీమేక్ చేస్తున్నాడు పవన్. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే ఫిబ్రవరి సెకెండ్ వీక్ నుంచి క్రిష్ మూవీని సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఇలా 2 సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలనేది పవన్ ప్లాన్.

రాబిన్ హుడ్ మూవీస్ టైపులో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ ఇది.