పవన్ ముఖ్య అతిథి గా....
Sunday,September 18,2016 - 10:00 by Z_CLU
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్, ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్కుమార్ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ‘జాగ్వార్’. రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరగనుంది.
ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథి గా హాజరుకానున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఇటీవలే పవన్ ను కలిసి ఆడియో వేడుకకు ఆహ్వానించాడు నిర్మాత హెచ్.డి.కుమారస్వామి. ఇందుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.భారీ ఎత్తున జరిగే ఈ వేడుకకు ఖచ్చితంగా హాజరు అవుతానని పవన్ చెప్పాడట. ఇంకా ఈ వేడుకకు తెలంగాణ ముఖ్య మంత్రి కె.సి.ఆర్ గారు కూడా హాజరు కానున్నారని సమాచారం.