Orey Bujjiga - ఒక రోజు ముందే రిలీజ్

Thursday,December 24,2020 - 01:22 by Z_CLU

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఈ చిత్రం నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా డిసెంబర్ 31న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌వుతుంది.

నిజానికి ఈ సినిమాను జనవరి 1న విడుదల చేయాలనుకున్నారు. కానీ డిసెంబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. దీని వెనక ఓ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఏంటో స్వయంగా రాధామోహన్ చెబుతున్నారు.

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ – “డిసెంబర్ లో రిలీజ్ అయిన మా బెంగాల్ టైగర్ బ్లాక్ బస్టర్ అయింది. బెంగాల్ టైగర్, పంతం.. ఇవన్నీ గురువారం విడుదల అయ్యి హిట్ అవడంతో, ఈ గురువారం డిసెంబర్ 31న రావడంతో 31న రిలీజ్ కన్ఫర్మ్ చేశాం. కొత్త సంవత్సరంలో అందరూ ధియేటర్స్ లో ఒరేయ్ బుజ్జిగా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. న్యూ ఇయర్ లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి చూడదగ్గ 100% ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఒరేయ్ బుజ్జిగా ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది.“ అన్నారు.