మళ్లీ కలిసిన రాజ్ తరుణ్, హెబ్బా పటేల్
Saturday,November 16,2019 - 01:37 by Z_CLU
రాజ్తరుణ్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఒరేయ్ బుజ్జిగా. కొండా విజయ్ కుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కేకే రాధామోహన్ నిర్మాత. ప్రస్తుతం షూటింగ్ మోడ్ లో ఉన్న ఈ సినిమాలోకి హెబ్బా పటేల్ ను తీసుకున్నారు.
తాజా షెడ్యూల్లో హెబ్బా పటేల్ జాయిన్ అయింది. ఆమెపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలో మళవిక, హెబ్బా పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నాడు నిర్మాత.
రాజ్ తరుణ్, హెబ్బ పటేల్ ది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి నటిస్తే ఆ ప్రాజెక్టుకు మంచి బజ్ వస్తుంది. అందుకే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆఖరి నిమిషంలో హెబ్బాను ఎంపిక చేశారు.
నటీనటులు:
రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బాపటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య
టెక్నీషియన్లు
సంగీతం: అనూప్ రూబెన్స్
మాటలు: నంద్యాల రవి
ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
డాన్స్: శేఖర్,
ఆర్ట్: టి.రాజ్కుమార్,
ఫైట్స్: రియల్ సతీష్,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను),
నిర్మాత: కె.కె.రాధామోహన్,
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కొండా విజయ్కుమార్.