ఉగాది కానుకగా మార్చి 25న ‘ఒరేయ్‌ బుజ్జిగా`

Thursday,February 13,2020 - 11:12 by Z_CLU

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌వుతుంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ – “ఇటీవ‌ల విడుద‌ల చేసిన మా ‘ఒరేయ్ బుజ్జిగా…’ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. రాజ్‌ తరుణ్‌ కి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మా బేన‌ర్‌లో ‘ఏమైంది ఈ వేళ’, ‘అధినేత’, ‘బెంగాల్ టైగర్’, ‘పంతం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్ లకు త‌ప్ప‌కుండా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. ” అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.