యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా…`. ఇప్పటికే విడుదలైన టీజర్ అంచనాలను పెంచిన విషయం తెలిసిందే..యూత్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు ఈ మూవీకి మరింత క్రేజ్ను సంపాదించిపెట్టాయి.
ఈ చిత్రంలోని ఒక్కో పాటను విడుదల చేస్తూ హైప్ తీసుకువచ్చిన చిత్ర యూనిట్ ఈ రోజు జ్యూక్ బాక్స్ ద్వారా అన్ని పాటలను విడుదలచేసింది. అనూప్ రూబెన్స్ స్వర పరిచిన అన్ని పాటలు సంగీతాభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ మాయ పేరేమిటో.. ఏమిటో.. అంటూ హూశారుగా సాగే ఈ పాటని లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ కె.కె రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్, పి.మేఘన అద్భుతంగా ఆలపించి వీనుల విందు కలిగించారు.
కృష్ణవేణి ..కృష్ణవేణి అంటూ రాహుల్ సిప్లిగంజ్ తనదైన శైలిలో పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. `సరిగమగమ గామ హంగామ చేద్దామా,,పదనిసనిస నీస్సా నీ నీషా..నీదమ్మా` అంటూ హుశారుగా సాగే ఈ పాటలో రాజ్తరుణ్ ఎనర్జిటిక్ స్టెప్పులు, హెబా పటేల్ అందాలు యూత్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గానం చేశారు.
కలలు చూసినా కన్నులే నేడు మోసెనే కన్నీల్లే… హాయి పంచినా గుండెకే ఓ గాయమయ్యెనే..అంటూ అర్దవంతంగా మనసుకు హత్తుకునే ఈ విరహగీతాన్ని కాసర్ల శ్యామ్ రాయగా లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అంతే అద్భుతంగా ఆలపించారు. ఈ సినిమాలోని పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడులయ్యాయి.