సాహో కంటే ముందే ప్రభాస్ నుంచి మరో సినిమా

Wednesday,March 14,2018 - 03:11 by Z_CLU

ఈక్వేషన్లు మారాయి, డేట్స్ సెట్ అయ్యాయి. సాహో కంటే ముందే మరో సినిమా రెడీ అవుతోంది. అవును.. బాహుబలి-2 లాంటి గ్రాండ్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి సాహో సినిమా రావడం లేదు. అంతకంటే ముందు తన పెదనాన్న కృష్ణంరాజు నిర్మాణంలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్

కృష్ణంరాజుకు చెందిన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో జిల్ అనే సినిమా చేసిన రాధాకృష్ణ కుమార్ దీనికి దర్శకుడు. ఈ మూవీ జులై నుంచి సెట్స్ పైకి వస్తుంది. 3 నెలల్లో షూటింగ్ పూర్తిచేసి, ఈ ఏడాది చివరి నాటికి థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.

ఇక సాహో సినిమా విషయానికొస్తే, దీనికి సంబంధించి భారీ షెడ్యూల్ ఇంకా మిగిలే ఉంది. త్వరలోనే రొమేనియా, అబుదాది, దుబాయ్ లో షూట్ చేస్తారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు మరో 6 నెలలు టైం తీసుకోబోతున్నారు. ఇవన్నీ పూర్తిచేసుకొని సాహో థియేటర్లలోకి వచ్చేది వచ్చే ఏడాదే. సో.. అంతకంటే ముందే రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్.