రామ్ సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్

Tuesday,September 05,2017 - 03:30 by Z_CLU

ప్రస్తుతం కిషోర్ తిరుల దర్శకత్వంలో ఉన్నది ఒక్కటే జిందగీ అనే సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమాలో మొన్నటివరకు ఇద్దరు హీరోయిన్లు మాత్రమే. తాజాగా మరో హీరోయిన్ చేరింది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తుండగా.. తాజాగా అనీషా ఆంబ్రోస్ కూడా చేరింది.

గోపాల గోపాల, ఫ్యాషన్ డిజైనర్ లాంటి సినిమాల్లో నటించిన అనీషా.. త్వరలోనే రామ్ సినిమా సెట్స్ పైకి రానుంది. సినిమాలో ఆమెకు ఓ కీలకమైన పాత్రను అప్పగించారు. అది కూడా ఇటలీలో షూట్ చేయబోతున్నారు. త్వరలోనే జరగనున్న ఇటలీ షెడ్యూల్ లో జాయిన్ అవుతుంది అనీషా.

నిజానికి ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలో మొదట మేఘా ఆకాష్ ను హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె స్థానంలో లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. ఇప్పుడు అనీష్ కూడా వచ్చి చేరింది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫ్రెండ్ షిప్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది