ఎన్టీఆర్ నుంచి మరో బృందావనం

Saturday,July 01,2017 - 02:01 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో బృందావనం ఒకటి. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలకు దూరమైన ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి క్లీన్ కుటుంబ కథాచిత్రంలో నటించబోతున్నాడు. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో కావడం విశేషం. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మంచి ప్యామిలీ కథాచిత్రం రాబోతోందట.

నవంబర్ నుంచి ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్, జై లవకుశ ప్రాజెక్టు వర్క్ పూర్తిచేస్తాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా పవన్ కల్యాణ్ సినిమాను కంప్లీట్ చేసి ఎన్టీఆర్ తో చేతులు కలుపుతాడు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రానుంది.

కుటుంబకథా చిత్రాలకు త్రివిక్రమ్ పెట్టిందిపేరు. అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అ..ఆ లాంటి మరో సూపర్ హిట్ ఇచ్చాడు త్రివిక్రమ్. ప్రస్తుతం పవన్ తో చేస్తున్న సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనరే.