గ్రాండ్ గా "ఒక్కడు మిగిలాడు" ప్రీ రిలీజ్ ఈవెంట్
Monday,November 06,2017 - 11:07 by Z_CLU
అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా పద్మజ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యానర్ఫై రూపొందుతున్న చిత్రం `ఒక్కడు మిగిలాడు`. ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది.
చిత్ర కథానాయకుడు మంచు మనోజ్ మాట్లాడుతూ.. “ఈ స్క్రిప్ట్కు నేను గౌరవమివ్వాలని, ఒళ్లు దగ్గర పెట్టుకని సినిమా చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాను. సినిమాలో రెండు పాత్రల్లో కనపడతాను. ఎవర్నీ కించపరిచే ఉద్దేశంతో చేసిన సినిమా కాదిది. ఈ సినిమాకు అజయ్గారే హీరో. శివ నందిగాం బ్యాగ్రౌండ్ స్కోర్, రామరాజుగారి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. నిర్మాతలు ఎంతో సహకారం అందించారు“ అన్నారు.
చిత్ర దర్శకుడు అజయ్ అండ్రూస్ మాట్లాడుతూ.. “సినిమాలో సాంగ్స్ ఎక్కడా ఉండవు. సినిమా ప్రారంభమైనప్పటి నుండి ముగిసే వరకు ఓకే టెంపోలో సినిమా ఉంటుంది. మనోజ్ అందించిన సపోర్ట్ మరచిపోలేనిది. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం తెరపై చూస్తే తెలుస్తుంది. వెయిట్ పెరిగారు, మళ్లీ వెయిట్ తగ్గారు. నటించడమే కాదు, అమేజింగ్ యాక్షన్ సీన్ను కంపోజ్ చేశారు. పాత్ర లుక్, డైలాగ్ డెలివరీ కోసం ఆయన పడ్డ కష్టం నాకు మాత్రమే తెలుసు.“ అన్నారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన నారా రోహిత్ మాట్లాడుతూ.. “నాకు మనోజ్ టైటిల్ ఎపిసోడ్ పంపినప్పుడే చాలా ఆనందమేసింది. ఇలాంటి ఓ సినిమాను నమ్మి నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, కోదండ రామరాజు సినిమాటోగ్రఫీ చాలా బావున్నాయి. మనోజ్ రెండు పాత్రలను అద్భుతమైన వేరియేషన్స్తో క్యారీ చేశాడు. ఈ చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
నటీనటులు – మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్
కళ: పి.ఎస్.వర్మ
సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
స్క్రీన్ ప్లే: గోపీమోహన్
సంగీతం: శివ నందిగామ
నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్
దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి.