Allu Arjun Pushpa - అఫీషియల్ గా 2 భాగాలు

Thursday,May 13,2021 - 03:37 by Z_CLU

అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుందని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ప్రచారం నిజమేనని తెలిపారు. కథ పరంగా రెండు భాగాలుగా చేసే అవకాశం ఉందని అందుకే మొదటి నుండి సినిమాను రెండు పార్ట్స్ గా తీయాలనుకున్నామని అన్నారు. ఇక పుష్ప ప్రాంచైజీకి పెట్టనున్న బడ్జెట్ కూడా అఫీషియల్ గా ప్రకటించారు. దాదాపు 260 కోట్ల బడ్జెట్ తో భారీ రేంజ్ లో నిర్మిస్తున్నట్లు చెప్పారు నిర్మాతలు. దీంతో ఇటు బన్నీ ఫ్యాన్స్ లో అటు ప్రేక్షకుల్లో ‘పుష్ప’ పై భారీ అంచనాలు మొదలయ్యాయి. రెండు పార్ట్స్ అని నిర్మాతలు కన్ఫర్మ్ చేయగానే ‘బాహుబలి’ ప్రాంచైజీతో పోలుస్తూ మరో సారి మన తెలుగు సినిమా సత్తా చాటే విధంగా ‘పుష్ప’ రూపొందుతుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సినిమా లవర్స్.

ఇటివలే టీజర్ తో హంగామా చేసి అందరినీ ఎట్రాక్ట్ చేసిన ‘పుష్ప’ సినిమా మొదటి భాగం ఆగస్ట్ లో విడుదల అనుకున్నారు. కానీ షూటింగ్ వాయిదా పడటం థియేటర్స్ మూసివేత కరణంగా అక్టోబర్ 13 న విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. పార్ట్ 1 కి సంబంధించి ఇప్పటికే కొన్ని సన్నివేశాలు మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన బ్యాలెన్స్ షూట్ ఫినిష్ చేసి సెప్టెంబర్ కల్లా సినిమాను రెడీ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్. ఇక రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

సినిమాలో ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నాడు బన్నీ. ఈ సినిమాతో అల్లు అర్జున్ నటుడిగా మరో మెట్టు ఎక్కనున్నాడని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. మరి రెండు భాగాలుగా రానున్న ‘పుష్ప’ తో ఐకానిక్ స్టార్ ఎంతటి సంచలన విజయం అందుకుంటుందో వేచి చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఫహాద్ ఫాసిల్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాలో సునీల్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ ఫ్రాంచైజీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics