ఓ పిట్ట కథ: ముందు సాంగ్ షూట్, తర్వాత ట్యూన్
Sunday,February 16,2020 - 01:42 by Z_CLU
భవ్య క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. వి.ఆనందప్రసాద్ నిర్మాత. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్ రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్గా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇటీవల రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే “ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే“ అంటూ సాగే మెలోడీ పాటకు కూడా మంచి స్పందన వస్తోంది. పూజా హెగ్డే చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ పాటను అమలాపురం, కాకినాడ పరిసరాల్లో చిత్రీకరించారు. పాట చిత్రీకరణలో ఓ తమాషా ఉంది. మూవీలో సన్నివేశం మూడ్ కి తగ్గట్టుగా అక్కడ లొకేషన్లలో విజువల్స్ ని తెరకెక్కించారు. తొలుత విజువల్స్ షూట్ చేశాకే హైదరాబాద్ లో ట్యూన్ కట్టారు.
ఇలా ఇంతకుముందు ప్రముఖ దర్శకుడు వంశీ `లేడీస్ టైలర్` కోసం ”ఎక్కడ ఎక్కడ దాక్కున్నావే” పాటలో ప్రయోగం చేశారు. విజువల్స్ షూట్ చేశాక ఇళయరాజాతో ఆ బాణీని సిద్ధం చేయించారు వంశీ గారు. ఆ తరహాలోనే ఓ పిట్టకథలో కూడా సాంగ్ షూట్ చేసిన తర్వాత ట్యూన్ కట్టారు.
ఒక విలేజ్లో జరిగే కథ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను కలిగిస్తుంది. పతాక సన్నివేశాల వరకూ అదే థ్రిల్ కొనసాగుతుంది. ట్విస్టులు థ్రిల్ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగుతుంది ఈ మూవీ.
నటీనటులు:
విశ్వంత్, సంజయ్రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి
సాంకేతిక నిపుణులు:
పాటలు: శ్రీజో
ఆర్ట్: వివేక్ అన్నామలై
ఎడిటర్: డి.వెంకటప్రభు
కెమెరా: సునీల్ కుమార్ యన్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి
నిర్మాత: వి.ఆనంద ప్రసాద్.
కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం : చెందుముద్దు