మహర్షి సెకెండ్ సింగిల్.. దేవిశ్రీ మార్క్

Friday,April 12,2019 - 05:13 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ మహర్షి నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ఫ్రెండ్ షిప్ కాన్సెప్ట్ తో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్, ఇప్పుడు సెకెండ్ సింగిల్ రిలీజ్ చేశారు. నువ్వే సమస్తం అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను శ్రీమణి రాస్తే, యాజిన్ నిజార్ ఆలపించాడు.

పాటలో దేవిశ్రీప్రసాద్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి సాంగ్ తో పాటు కొన్ని మేకింగ్ షాట్స్, స్టిల్స్ కూడా విడుదల చేశారు. సాహిత్యం వింటుంటే మహేష్ పై వచ్చే మాంటేజ్ సాంగ్ అనిపిస్తోంది.

వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. హీరో అల్లరినరేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.