ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై మరో క్లారిటీ

Sunday,February 11,2018 - 12:16 by Z_CLU

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు సంబంధించి ఒక్కో అంశంపై క్లారిటీ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్లారిటీ వచ్చింది. ఓ పాపులర్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారంటూ మొన్నటివరకు రూమర్లు వినిపించాయి. పాపులర్ రచయిత మధుబాబు నవల ఆధారంగా ఈ సినిమా రాబోతోందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఆ రచయిత క్లారిటీ ఇచ్చాడు.

తన నవలల్లో ఏ ఒక్క దానికి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాతో సంబంధం లేదని స్పష్టంచేశారు రచయిత మధుబాబు. నిజానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్రివిక్రమ్ తనను సంప్రదించలేదని అంటున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టంచేశారు. అలా ఈ సినిమాపై మొన్నటివరకు వచ్చిన పుకార్లకు రూమర్లకు చెక్ పెట్టారు ఈ స్టార్ రైటర్.

ఇక మూవీ అప్ డేట్స్ విషయానికొస్తే మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ మూవీ కోసం ఇప్పటికే సరికొత్తగా ముస్తాబయ్యాడు ఎన్టీఆర్. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ సినిమాను నిర్మించనున్నారు.