ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా Mr మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్

Thursday,January 17,2019 - 06:03 by Z_CLU

ఈ శనివారం గ్రాండ్ గా జరగనుంది Mrమజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్. అయితే ఈ ఈవెంట్ కి NTR చీఫ్ గెస్ట్ గా  రానున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. దాంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుంది.

అఖిల్ రీసెంట్ సూపర్ హిట్ ‘హలో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్  గా అటెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇదే వరసలో ఈ సినిమాకి NTR అటెండ్ అవుతుండటంతో అటు అక్కినేని ఫ్యాన్స్ లో, ఇటు NTR ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. భారీ ఎగ్జైట్ మెంట్స్ మధ్య జరగనున్న ఈ ఈవెంట్ లో NTR స్పీచ్ ఎలా ఉండబోతుందోనన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.

ఈ నెల 19 న సాయంత్రం 6 గంటల నుండి JRC కన్వెన్షన్, ఫిల్మ్ నగర్ లో ఈ ఈవెంట్ జరగనుంది. కలర్ ఫుల్ కార్యక్రమాల మధ్య జోష్ ఫుల్ గా జరగనున్న ఈవెంట్ లో సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు రివీల్ చేయనున్నారు మేకర్స్.