కలిసి అమెరికా వెళ్లిన చరణ్, ఎన్టీఆర్

Wednesday,March 07,2018 - 01:33 by Z_CLU

త్రివిక్రమ్ సినిమా మేకోవర్ పని మీద ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడని అంతా అనుకుంటున్నారు. మరోవైపు రంగస్థలం సినిమా వర్క్ లో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడని కూడా అందరికీ తెలుసు. కానీ ఊహించని విధంగా ఈ ఇద్దరు హీరోలు కలిసి అమెరికా వెళ్లారు. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చరణ్, ఎన్టీఆర్ కలిశారు. అట్నుంచి అటే అమెరికా వెళ్లారు. ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ వీళ్లిద్దరూ ఇంత సడెన్ గా అమెరికా ఎందుకు వెళ్లారో తెలుసా..? ఎస్.. మీ డౌట్ నిజమే.. రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్-చరణ్ లాస్ ఎంజెల్స్ వెళ్లారు. వీళ్లిద్దరిపై అక్కడ టెస్ట్ షూట్ జరగనుంది. ఈ టెస్ట్ కట్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై క్లారిటీ లేదు.

జులై నుంచి ఎన్టీఆర్, చరణ్ తో వర్క్ షాప్ స్టార్ట్ చేయబోతున్నాడు జక్కన్న. దీనికి ప్రీ-విజువలైషన్ అనే పేరు కూడా పెట్టారు. అంతకంటే ముందు టెస్ట్ కట్ కోసం ఇద్దరు హీరోలు అమెరికా వెళ్లారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే పూర్తిచేశాడట రాజమౌళి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ నుంచి ఈ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వస్తుంది.